మోదీ వాచ్ ప్రత్యేకత ఇదే: 1947 రూపాయి నాణెంతో తయారైన అరుదైన టైమ్పీస్
మన భారత్, న్యూ డిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ విజయవంతమైన రాజకీయ నాయకుడే కాకుండా, ప్రత్యేకమైన ఫ్యాషన్ సెన్స్ కలిగిన వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు. ఆయన ధరించే హాఫ్–స్లీవ్ కుర్తాలు, కళ్లజోడులు మాత్రమే కాకుండా… చేతికి కనిపించే వాచ్ కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
మోదీ ధరించే ఈ ప్రత్యేక వాచ్లో 1947 నాటి ఒక రూపాయి నాణెం అమర్చబడింది. అందులో ఉన్న నడిచే పులి (Walking Tiger) చిత్రం దీన్ని మరింత విలక్షణంగా నిలబెడుతోంది. ఈ వాచ్ను జైపూర్ వాచ్ కంపెనీ ప్రత్యేకంగా రూపకల్పన చేసింది. దీనిలో జపాన్కు చెందిన మియోటా (Miyota) ఆటోమేటిక్ మెకానిజం ఉపయోగించారు.
వాచ్ ముఖ్య విశేషాలు:
1947లో బ్రిటిష్ పాలనలో ముద్రించిన చివరి ఒక రూపాయి నాణెం
43mm స్టెయిన్లెస్ స్టీల్ కేసింగ్
జపనీస్ మియోటా ఆటోమేటిక్ మవ్మెంట్
హెరిటేజ్ మరియు ఆధునిక డిజైన్ కలయిక
ఈ ప్రత్యేక వాచ్ మార్కెట్ ధర ₹55,000 – ₹60,000 మధ్య ఉంటుంది. చరిత్రను, కళను, ఆధునికతను ప్రతిబింబించే ఈ అరుదైన టైమ్పీస్ మోదీ స్టైల్కు మరో ప్రత్యేకతను జోడించింది.
