ప్రభుత్వాల కంటే వేగంగా స్పందించిన మహానుభావుడు సత్యసాయి” – సీఎం చంద్రబాబు

Published on

ప్రభుత్వాల కంటే వేగంగా స్పందించిన మహానుభావుడు సత్యసాయి” – సీఎం చంద్రబాబు

మన భారత్, పుట్టపర్తి: సేవ, ప్రేమ, మనిషితనం అనే గొప్ప విలువలకు సత్యసాయి బాబా ప్రతి రూపమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. పుట్టపర్తిలో కొనసాగుతున్న సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆయన మాట్లాడారు.

చంద్రబాబు మాట్లాడుతూ, “భూమిపై మనకు తెలిసిన, మనం ప్రత్యక్షంగా చూసిన దైవస్వరూపం సత్యసాయి బాబానే. ఆయన చేసిన సేవలకు సాటి ఇంకెవరూ లేరు. ఆయన 1600 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీరు అందించారు. 102 విద్యాలయాలు, అనేక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, వైద్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో 200 కేంద్రాల ద్వారా సత్యసాయి ట్రస్ట్ సేవలందిస్తోంది. ఈ సేవా కార్యక్రమాల్లో 7 లక్షల మందికి పైగా వాలంటీర్లు పాల్గొంటున్నారు” అని పేర్కొన్నారు.

అదే సమయంలో బాబా సేవా భావాన్ని ప్రత్యేకంగా కొనియాడుతూ, “ప్రభుత్వాల కంటే వేగంగా, క్షణాల్లో స్పందించిన మహానుభావుడు సత్యసాయి. సమస్య ఎక్కడున్నా తెలుసుకుని వెంటనే సహాయం అందించే వారు. ఆయన చూపిన మార్గంలో మనమంతా నడిస్తే సమాజం మరింత వెలుగొందుతుంది” అని అన్నారు.

సత్యసాయి బోధనలు, ఆయన సేవామార్గం తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయని సీఎం చంద్రబాబు తెలిపారు.

Latest articles

గుబిడి భజన పోటీల్లో 12వ వార్డు భజన మండలి ప్రతిభ..

మన భారత్, ఆదిలాబాద్: గుబిడి గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 12వ వార్డుకు చెందిన శ్రీ రమా సహిత సత్యనారాయణ...

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

More like this

గుబిడి భజన పోటీల్లో 12వ వార్డు భజన మండలి ప్రతిభ..

మన భారత్, ఆదిలాబాద్: గుబిడి గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 12వ వార్డుకు చెందిన శ్రీ రమా సహిత సత్యనారాయణ...

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....