బస్సు బోల్తా.. 42 మంది సజీవదహనం

Published on

📰 Generate e-Paper Clip

సౌదీ అరేబియాలో విషాదం: యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తా – 42 మంది సజీవదహనం

మన భారత్, హైదరాబాద్: సౌదీ అరేబియాలో భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. మక్కాలో ప్రార్థనలు ముగించుకుని మదీనాకు బయలుదేరిన యాత్రికుల బస్సు ముఫరహత్ సమీపంలో వెళ్తుండగా డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఢీకొట్టిన కొన్ని క్షణాల్లోనే బస్సులో మంటలు చెలరేగి ఆవిరైపోయేంతలా దగ్ధమైంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 20 మంది మహిళలు, 11 మంది పిల్లలు ఉన్నట్లు సమాచారం. మృతుల్లో  హైదరాబాద్ వాసులు ఎక్కువ మంది ఉన్నట్లు నేషనల్ మీడియా నివేదికలు తెలియజేశాయి. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అగ్నిమాపక దళాలు, రెస్క్యూ టీములు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నప్పటికీ, మంటల తీవ్రత కారణంగా ప్రాణాపాయం తప్పించలేకపోయారు. ప్రమాదానికి గల నిర్దిష్ట కారణాలు ఇంకా వెలుగు చూడాల్సి ఉంది.

ఈ దారుణ ఘటనతో హైదరాబాద్‌లోని కుటుంబాల్లో ఆర్తనాదాలు వెల్లువెత్తాయి. మృతుల వివరాలు సౌదీ అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం.

 

Saudi Accident, Makkah Madina Bus Crash, Hyderabad Pilgrims, Saudi Road Accident, Manabharath.Com

Latest articles

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ..

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అంబుగాం ఉప సర్పంచ్ ఆత్రం భరత్.. మన భారత్,...

More like this

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...