బిహార్‌లో NDA బంపర్ మెజారిటీ.. అయితే సీఎం ఎవరు?

Published on

📰 Generate e-Paper Clip

CM పీఠంపై సందిగ్ధం… రేపు JDU ఎమ్మెల్యేలతో నితీశ్ కీలక భేటీ
బిహార్‌లో NDA బంపర్ మెజారిటీ – అయితే సీఎం ఎవరు?

మన భారత్, పట్నా, నవంబర్ 15: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA విజయఢంకా మోగించినప్పటికీ, ముఖ్యమంత్రి పదవి పై ఇంకా స్పష్టత రాలేదు. మొత్తం 202 సీట్లతో సూపర్ మెజారిటీ సాధించిన కూటమిలో నాయకత్వంపై సందిగ్ధత నెలకొని ఉండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

ఈ నేపథ్యంలో సీఎం పీఠంపై తిరిగి అధిష్టానాన్ని ఆశిస్తున్న జేడీయూ అధినేత నితీశ్ కుమార్… రేపు ఆదివారం తన పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. తద్వారా NDA భవిష్యత్ నాయకత్వంపై నిర్ణయం త్వరలోనే వెలువడే అవకాశాలు ఉన్నాయి.

“బిహార్‌ను ముందుకు నడిపించే సామర్థ్యం నితీశ్‌కే ఉంది. రాజకీయంగా, పరిపాలనా పరంగా ‘వివాదరహిత’ అభ్యర్థి ఆయన మాత్రమే. మా రాష్ట్రానికి ప్రత్యామ్నాయం లేరని” జేడీయూ ఎమ్మెల్యేలు ధృవీకరిస్తున్నారు.

ఫలితాల అనంతరం JDU కార్యాలయం, నితీశ్ నివాసం రాజకీయ నాయకులు, కార్యకర్తల రద్దీతో కిక్కిరిసిపోయింది. LJP నేత చిరాగ్ పాస్వాన్‌తో పాటు అనేకమంది నితీశ్‌ను కలిసి అభినందించారు. అయితే, NDA భాగస్వాములు ఎవరు ముఖ్యమంత్రిపీఠానికి మద్దతు ఇస్తారనే అంశం కీలకంగా మారింది.

బిహార్ రాజకీయాల్లో మరోసారి నాయకత్వ మార్పులు జోరందుకోవడంతో, రేపటి నితీశ్–ఎమ్మెల్యేల భేటీపై రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి నిలిచింది.

Latest articles

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ..

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అంబుగాం ఉప సర్పంచ్ ఆత్రం భరత్.. మన భారత్,...

పల్లి (బి) సర్పంచ్ కటకం సంజీవ్‌కు ఘన సన్మానం

పల్లి (బి) సర్పంచ్ కటకం సంజీవ్‌కు ఘన సన్మానం మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని పల్లి (బి) గ్రామ...

More like this

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ..

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అంబుగాం ఉప సర్పంచ్ ఆత్రం భరత్.. మన భారత్,...