అగ్ని ప్రమాదం.. 50 క్వింటాళ్ల పత్తి బూడిద 

Published on

జైనథ్‌లో అగ్ని ప్రమాదం.. 50 క్వింటాళ్ల పత్తి బూడిద 

లక్ష్మీపూర్ గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు – రైతుకు తీవ్ర నష్టం

మన భారత్, జైనథ్, నవంబర్ 10: జైనథ్ మండలంలో సోమవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ స్టేషన్ అధికారుల సమాచారం ప్రకారం, లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రైతు ఎడవ్ దీపక్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. కొన్ని క్షణాల్లోనే అగ్ని ప్రమాదం తీవ్రరూపం దాల్చి పరిసర ప్రాంతాలను ఆందోళనకు గురి చేసింది.

మంటలను ఆర్పేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది సహాయంతో చివరకు మంటలను నియంత్రించారు. ఈ ఘటనలో దాదాపు 50 క్వింటాళ్ల పత్తి పూర్తిగా దగ్ధమై బూడిద అయిందని అధికారులు తెలిపారు.

పత్తి సీజన్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో రైతు దీపక్ కు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని గ్రామస్థులు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌ల వల్ల ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలను హెచ్చరించారు.

Latest articles

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

మన భారత్, ఆదిలాబాద్: పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్...

More like this

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...