జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటన..

Published on

ఆదిలాబాద్‌లో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటన.. రైతులతో భేటీకి సన్నాహాలు

మన భారత్, ఆదిలాబాద్: బీఆర్ఎస్ నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం ఆమె కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ రైతులతో సమస్యలు తెలుసుకోనున్నారు.

మరికాసేపట్లో కవిత కాటన్ మార్కెట్ చేరుకొని రైతులతో ముఖాముఖీ చర్చ జరపనున్నారు. పత్తి ధరలు, వ్యవసాయ విధానాలు, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులపై రైతుల అభిప్రాయాలు తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటన ఉన్నట్లు జాగృతి నాయకులు తెలిపారు. తరువాత ఆమె కొర్ట చనాక ప్రాజెక్టును సందర్శించనున్నారు.

ఈ సందర్బంగా జిల్లా జాగృతి నాయకులు రంగినేని శ్రీనివాస్, స్థానిక ప్రజా ప్రతినిధులు, మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కవిత పర్యటనతో జిల్లా రాజకీయ వాతావరణం కాస్త ఉత్కంఠభరితంగా మారింది.

🚩కవిత పర్యటనలో జాగృతి కార్యకర్తలు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు.

Latest articles

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

మన భారత్, ఆదిలాబాద్: పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్...

More like this

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...