ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం..

Published on

 రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

మన భారత్, మెదక్ జిల్లా, నవంబర్ 2: రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో ఆదివారం ఐకెపి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐకెపి నిర్వాహకురాలు కమ్మరి శ్యామల మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాలకు తరలించాలని సూచించారు.

దళాలకు విక్రయిస్తే నష్టపోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. ప్రభుత్వం రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని న్యాయమైన ధరలు అందించే విధంగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రైతులు ధాన్యం తూకం, తేమ శాతం తదితర అంశాలను ఖచ్చితంగా పరిశీలించి కేంద్రంలోనే విక్రయించాలన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సర్దార్ నాయక్, కమ్యియా, బాబు, భాస్కర్, దుర్గ, క్షత్రియ, పొమ్య, సుభాష్ తండా నాయకులు పాల్గొన్నారు. గ్రామంలో రైతులు ఈ కేంద్రం ప్రారంభాన్ని హర్షంగా స్వాగతించారు.

Latest articles

గుబిడి భజన పోటీల్లో 12వ వార్డు భజన మండలి ప్రతిభ..

మన భారత్, ఆదిలాబాద్: గుబిడి గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 12వ వార్డుకు చెందిన శ్రీ రమా సహిత సత్యనారాయణ...

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

More like this

గుబిడి భజన పోటీల్లో 12వ వార్డు భజన మండలి ప్రతిభ..

మన భారత్, ఆదిలాబాద్: గుబిడి గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 12వ వార్డుకు చెందిన శ్రీ రమా సహిత సత్యనారాయణ...

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....