బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటన వివరాలు..

Published on

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రేపు పలు మండలాల్లో సోయాబీన్ కొనుగోలు కేంద్రాల ప్రారంభం
మన భారత్, ఆదిలాబాద్ | నవంబర్ 2: బోథ్ నియోజకవర్గ ప్రజల వ్యవసాయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని  ఎమ్మెల్యే అనిల్ జాదవ్  (సోమవారం, నవంబర్ 3) పలు మండలాల్లో సోయాబీన్, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. రైతులకు సకాలంలో పంట కొనుగోలు సదుపాయం కల్పించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం.

ప్రణాళిక ప్రకారం సోమవారం ఉదయం 10.00 గంటలకు నేరడిగొండ మండల కేంద్రంలో మొక్కజొన్న , సోయాబీన్ కొనుగోలు కేంద్రం, ఉదయం 10.30 గంటలకు బోథ్ మండల కేంద్రంలో, 11.10 గంటలకు ఇచ్చోడ మండలంలో సోయా కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభిస్తారు.

తరువాత ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వివాహ శుభకార్యాలలో పాల్గొని రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు తాంసి మండల కేంద్రంలో, 2.00 గంటలకు భీంపూర్ మండల కేంద్రంలోని స్థానిక అంగడి బజార్‌లో, 3.00 గంటలకు తలమడగు మండల కేంద్రంలో నూతన ఫంక్షన్ హాల్ ను ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు.

ఈ కార్యక్రమాలకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా మిత్రులు భారీగా హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ యూత్ జిల్లా నాయకులు అక్షయ్ కుమార్ పిలుపునిచ్చారు.

Latest articles

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

మన భారత్, ఆదిలాబాద్: పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్...

More like this

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...