తేమ శాతం పేరుతో రైతులను దోచుకుంటున్న ప్రభుత్వాలు

Published on

📰 Generate e-Paper Clip

మన భారత్, ఆదిలాబాద్: రైతులను దోచుకోవడం తప్ప ప్రభుత్వాలకు వేరే పనిలేదు” అని భారతీయ సంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భూమా రెడ్డి  తీవ్రంగా మండిపడ్డారు. గురువారం తాంసి మండల కేంద్రంలో భారతీయ సంఘ్ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై ధర్నా నిర్వహించారు. అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా భూమా రెడ్డి మాట్లాడుతూ, “సీసీఐ సంస్థలు పత్తి కొనుగోళ్లలో రైతులను నష్టపరుస్తున్నాయి. తేమ శాతం పేరుతో పత్తి బేళ్లను తిరస్కరించడం అన్యాయం. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని కనీసం 18 శాతం తేమతో పత్తి కొనుగోలు చేయాలని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.

రైతులు ఎండవానల మధ్య కష్టపడి పంటను పండిస్తే, ప్రభుత్వ విధానాల కారణంగా వారికి న్యాయం దొరకడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఐ అధికారులు రైతులకు మేలు చేసే విధంగా కొనుగోలు ప్రమాణాలను మార్చాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు కేతి రెడ్డి కృష్ణ రెడ్డి, జిల్లా కార్యదర్శి అడేపు శ్రీనివాస్, తాంసి మాజీ సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్, ఇతర రైతులు పాల్గొని ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Latest articles

మర్రి చెట్టు నీడలో ప్రమాణ స్వీకారం..

మర్రి చెట్టు నీడలో ప్రజాస్వామ్య ప్రమాణం.. సకినాపూర్ సర్పంచ్‌గా నికిత నగేష్ ప్రమాణ స్వీకారం మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు...

సాయి కిరణ్ కు ఘన సన్మానం..

యూపీఎస్సీలో పొన్నారి యువకుడి సత్తా – సాయి కిరణ్‌కు ఘన సన్మానం మన భారత్, ఆదిలాబాద్ : జిల్లా తాంసి...

జర్నలిస్టులకు త్వరలో అక్రిడిటేషన్ కార్డులు..

జర్నలిస్టులకు త్వరలో అక్రిడిటేషన్ కార్డులు: మంత్రి పొంగులేటి స్పష్టం మన భారత్, హైదరాబాద్: జర్నలిస్టుల చిరకాల వాంఛలైన అక్రిడిటేషన్ కార్డులు,...

కోడి గుడ్ల ధరలకు రెక్కలు..

కోడి గుడ్ల ధరలకు రెక్కలు… ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరిన రేట్లు మన భారత్, హైదరాబాద్: కోడి గుడ్డు ధరలు సామాన్యుడికి...

More like this

మర్రి చెట్టు నీడలో ప్రమాణ స్వీకారం..

మర్రి చెట్టు నీడలో ప్రజాస్వామ్య ప్రమాణం.. సకినాపూర్ సర్పంచ్‌గా నికిత నగేష్ ప్రమాణ స్వీకారం మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు...

సాయి కిరణ్ కు ఘన సన్మానం..

యూపీఎస్సీలో పొన్నారి యువకుడి సత్తా – సాయి కిరణ్‌కు ఘన సన్మానం మన భారత్, ఆదిలాబాద్ : జిల్లా తాంసి...

జర్నలిస్టులకు త్వరలో అక్రిడిటేషన్ కార్డులు..

జర్నలిస్టులకు త్వరలో అక్రిడిటేషన్ కార్డులు: మంత్రి పొంగులేటి స్పష్టం మన భారత్, హైదరాబాద్: జర్నలిస్టుల చిరకాల వాంఛలైన అక్రిడిటేషన్ కార్డులు,...