దేశీదారు తరలింపు ఇద్దరు యువకులకు రిమాండ్‌

Published on

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల పరిధిలో అక్రమ దేశీ మద్యం రవాణా చేస్తూ ఇద్దరు వ్యక్తులు ఎక్సైజ్ శాఖ అధికారుల చేతిలో పట్టుబడ్డారు. బుధవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విజేందర్ తెలిపిన వివరాల ప్రకారం – మండలంలోని బండల్ నాగపూర్ గ్రామానికి చెందిన అగ్గి మల్ల రవి, రాం టేకి ప్రశాంత్ అనే ఇద్దరు యువకులు మహారాష్ట్ర రాష్ట్రం నుంచి దేశీ దారును అక్రమంగా తాంసి ప్రాంతానికి తీసుకువస్తుండగా బోరజ్ వద్ద ఎక్సైజ్ సిబ్బంది వాహన తనిఖీల సమయంలో అడ్డుకున్నారు. సమీపంగా పరిశీలించగా, వారి వద్ద రూ.4 వేల విలువ గల 100 బాటిళ్ల (ప్రతి బాటిల్ 90 ఎంఎల్) దేశీ దారు స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం విక్రయం కోసం తాంసి గ్రామ పరిసరాలకు రవాణా చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇద్దరిపై ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, వారిని న్యాయస్థానానికి తరలించి రిమాండ్‌కు పంపినట్లు సీఐ విజేందర్ తెలిపారు. అక్రమ మద్య రవాణా, నిల్వ లేదా విక్రయం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక ప్రజలు కూడా ఇలాంటి అక్రమ మద్యం వ్యాపారాలను గుర్తిస్తే ఎక్సైజ్ శాఖకు సమాచారం అందించవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

Latest articles

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

మన భారత్, ఆదిలాబాద్: పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్...

More like this

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...