హైస్కూల్‌లో అదనపు కలెక్టర్ తనిఖీ

Published on

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 28: తాంసి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం అదనపు కలెక్టర్ సోమ రాజేశ్వర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో జరుగుతున్న విద్యా కార్యకలాపాలు, మధ్యాహ్న భోజన పథకం నాణ్యత, పరిసరాల పరిశుభ్రతను సమీక్షించారు. విద్యార్థులతో మాట్లాడిన అదనపు కలెక్టర్, వారి హాజరు వివరాలు, చదువుపై ఆసక్తి, బోధన విధానాలను తెలుసుకున్నారు. పాఠశాల సిబ్బందిని విద్యార్థుల శ్రేయస్సు, పాఠశాల పరిశుభ్రత, భద్రత అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించిన ఆయన, భోజనం నాణ్యత మెరుగుపరచాలని, పిల్లలకు పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల పరిసరాల్లో అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, పిల్లల చదువు, హాజరుపై శాశ్వతంగా దృష్టి పెట్టండి” అని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు, ఎంఈవో  శ్రీకాంత్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Latest articles

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

మన భారత్, ఆదిలాబాద్: పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్...

More like this

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...