గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తాం – మల్లెపూల నర్సయ్య

Published on

గ్రంథాలయాన్ని సందర్శించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సయ్య 

మన భారత్, ఆదిలాబాద్, అక్టోబర్ 28 : ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య మంగళవారం నేరడిగొండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలోని రిజిస్టర్లను పరిశీలించి, ప్రతిరోజూ ఎంతమంది పాఠకులు వస్తున్నారో, పుస్తకాలు అందుబాటులో ఉన్నాయా లేదా అనే అంశాలను గ్రంథాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందిని కోరారు. నిరుద్యోగులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే, విద్యార్థులకు గ్రంథాలయంలోనే ప్రశాంత వాతావరణంలో చదువుకునే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. తరువాత చైర్మన్ మల్లెపూల నర్సయ్యకు గ్రంథాలయ సిబ్బంది, స్థానిక నాయకులు శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బొడ్డు గంగా రెడ్డి, ఉపాధ్యక్షుడు ఆడే వసంత్ రావు, సీనియర్ నాయకులు ఏలేటి రాజశేఖర్ రెడ్డి, అనుపట్ల సంజీవ్, గట్టు అశోక్, రమేష్, యువ నాయకులు యండి సద్దాం, లైబ్రరీయన్ శ్రీకాంత్, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Latest articles

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

మన భారత్, ఆదిలాబాద్: పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్...

More like this

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...