కళాశాలలో యోగా శిక్షణ తరగతులు ప్రారంభం

Published on

తాంసి జూనియర్ కళాశాలలో యోగా శిక్షణ తరగతులు ప్రారంభం

మన భారత్, ఆదిలాబాద్: తాంసి  ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం యోగా శిక్షణ (HELP) కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. యోగా శిక్షకుడు సాయి కృష్ణ విద్యార్థులకు వివిధ యోగా ఆసనాలు చేయించి, యోగా ద్వారా కలిగే శారీరక, మానసిక లాభాలపై వివరించారు. ఆయన ప్రతిరోజూ కొద్ది నిమిషాలు యోగా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.

ఈ సందర్భంగా ఎస్సై జీవన్ రెడ్డి విద్యార్థులకు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే ప్రమాదాలు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం శారీరక ఆరోగ్యంతో పాటు సామాజిక బాధ్యతను కూడా పాటించాలని సూచించారు.

కార్యక్రమంలో కళాశాల  ఇన్చార్జి ప్రిన్సిపల్ ఉదయ్ భాస్కర్, ప్రవీణ్ కుమార్ బోధక సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు యోగా ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొని, ఆరోగ్యకర జీవన విధానం కోసం సంకల్పం వ్యక్తం చేశారు.

Latest articles

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

మన భారత్, ఆదిలాబాద్: పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్...

More like this

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...