ఓబీసీ చైర్మన్‌ కృష్ణయ్యకు కీలక భాద్యతలు

Published on

📰 Generate e-Paper Clip

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో రెహమత్నగర్ డివిజన్ ఇంచార్జ్‌గా గొల్ల కృష్ణయ్య నియామకం
నారాయణపేట జిల్లా ఓబీసీ చైర్మన్‌కు కీలక భాద్యతలు అప్పగించిన పార్టీ నేతృత్వం

మన భారత్, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న వేళ, బీఆర్ఎస్ పార్టీ నేతృత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నారాయణపేట జిల్లా ఓబీసీ చైర్మన్‌ శ్రీ గొల్ల కృష్ణయ్యను రెహమత్నగర్‌ డివిజన్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నియమించింది.

పార్టీ తరఫున బలమైన వ్యూహాలతో ఎన్నికల సమరాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని సూచించినట్లు సమాచారం. కృష్ణయ్య రాజకీయ ప్రస్థానంలో క్రమశిక్షణ, కృషి, సామాజిక సేవలకు పేరుగాంచిన నేతగా గుర్తింపు పొందారు. పార్టీ బలపర్చడంలో ఆయనకు ఉన్న అనుభవం, ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఈ నియామకంపై రెహమత్నగర్‌ ప్రాంతంలోని పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు కృష్ణయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన నాయకత్వంలో పార్టీ విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు.

గొల్ల కృష్ణయ్య మాట్లాడుతూ “పార్టీ ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కార దిశగా కృషి చేస్తాను. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థి విజయం సాధించేలా అహర్నిశలు పని చేస్తాను” అని తెలిపారు.

Latest articles

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ..

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అంబుగాం ఉప సర్పంచ్ ఆత్రం భరత్.. మన భారత్,...

పల్లి (బి) సర్పంచ్ కటకం సంజీవ్‌కు ఘన సన్మానం

పల్లి (బి) సర్పంచ్ కటకం సంజీవ్‌కు ఘన సన్మానం మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని పల్లి (బి) గ్రామ...

More like this

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ..

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అంబుగాం ఉప సర్పంచ్ ఆత్రం భరత్.. మన భారత్,...