వామన్నగర్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల NSS యూనిట్ ప్రత్యేక శిబిరం
మన భారత్, ఆదిలాబాద్: యువతలో సామాజిక సేవా స్పూర్తిని పెంపొందించే లక్ష్యంతో తాంసి ప్రభుత్వ జూనియర్ కళాశాల NSS యూనిట్ ఆధ్వర్యంలో వామన్నగర్ గ్రామంలో ప్రత్యేక శిబిరం (Special Camp) నిర్వహించనున్నట్లు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ సంతోష్ తెలిపారు. ఈ శిబిరం నవంబర్ 1 నుంచి 7 వరకు (01-11-2025 నుండి 07-11-2025 వరకు) ఏడు రోజులపాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్. సంతోష్ మాట్లాడుతూ, “ఈ శిబిరం ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యతా భావం, సేవా నిబద్ధత పెంపొందించడమే మా ప్రధాన ఉద్దేశ్యం. గ్రామ శుభ్రత, ఆరోగ్య అవగాహన, పర్యావరణ పరిరక్షణ, చెట్ల నాటకం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నాం” అని తెలిపారు.
శిబిరం సందర్భంగా విద్యార్థులు గ్రామ ప్రజలతో కలసి అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. గ్రామ పరిశుభ్రత, ప్లాస్టిక్ వ్యతిరేక ప్రచారం, ఆరోగ్య పరీక్ష శిబిరం, మరియు మహిళా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు NSS యూనిట్ ప్రతినిధులు తెలిపారు.
ప్రత్యేక శిబిరం విజయవంతం కావడానికి కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, గ్రామ పెద్దలు, ప్రజల సహకారం కోరుతున్నామని ఎన్. సంతోష్ పేర్కొన్నారు.
