మన భారత్ ఆదిలాబాద్:
ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 44వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ రోహిత్ ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల పోరులో ఆయనకు మొత్తం 1,258 ఓట్లు లభించగా, సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కాళ్ల సాయికి 553 ఓట్లు దక్కాయి.
దీంతో మహమ్మద్ రోహిత్ 705 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.
ప్రజల అభిమానం, విశ్వాసంతో ఈ విజయం సాధ్యమైందని మహమ్మద్ రోహిత్ పేర్కొన్నారు. స్థానిక సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ విజయంతో ఆదిలాబాద్ మున్సిపల్ రాజకీయాల్లో ఎంఐఎం బలం మరింత పెరిగినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
