మన భారత్ ఆదిలాబాద్:
ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి నియామత్ ఉల్లా ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల పోరులో ఆయనకు మొత్తం 1,242 ఓట్లు లభించగా, సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గండ్రత్ మహేందర్కు 765 ఓట్లు దక్కాయి.
దీంతో నియామత్ ఉల్లా 477 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఎంఐఎం శ్రేణులు సంబరాలు నిర్వహించారు.
స్థానిక సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం మరియు తాగునీటి సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని నియామత్ ఉల్లా తెలిపారు. ప్రజలు విశ్వాసంతో ఓటు వేసారని పార్టీ నాయకులు పేర్కొన్నారు.
ఈ విజయంతో ఆదిలాబాద్ మున్సిపల్ రాజకీయాల్లో ఎంఐఎం స్థానం మరింత బలపడినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
