మన భారత్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని 42వ వార్డు ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి కాంబ్లే స్వాతి ఘన విజయం సాధించారు. అధికారిక లెక్కల ప్రకారం ఆమెకు మొత్తం 950 ఓట్లు లభించగా, సమీప బీజేపీ అభ్యర్థిపై 408 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
42వ వార్డులో ఈ ఫలితం కాంగ్రెస్ కు ఉత్సాహాన్ని నింపింది. ఫలితాలు వెలువడగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు ప్రారంభించారు. కాంబ్లే స్వాతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వార్డు అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
ప్రజలు తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ వార్డు అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్వాతి పేర్కొన్నారు. ముఖ్యంగా తాగునీటి సదుపాయాలు, పారిశుధ్యం, రహదారుల మెరుగుదల, మహిళల సంక్షేమం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల లెక్కింపు పూర్తవడంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. 42వ వార్డు ఫలితం ఆదిలాబాద్ మున్సిపల్ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.
