మన భారత్ తెలంగాణ:
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే దిశగా రూ.1,000 కోట్ల వ్యయంతో మెగా ఫ్రైట్ ఎగ్జామినేషన్ మరియు ఓవర్ హాలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
ఈ ప్రాజెక్టు ద్వారా గూడ్స్ రైలు వ్యాగన్ల మరమ్మతులు, సాంకేతిక పరీక్షలు మరియు నిర్వహణ పనులు ఒకే చోట నిర్వహించేందుకు వీలు కలుగుతుంది. రాష్ట్రంలో సరుకు రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే లక్ష్యంతో ఈ మెగా ఫ్రైట్ ఓవర్ హాలింగ్ స్టేషన్ను వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు.
తెలంగాణలో ఇదే తొలి మెగా ఫ్రైట్ రిపేర్ కేంద్రం కావడం విశేషం. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే రైల్వే రంగంలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించనుంది. గూడ్స్ రవాణా వేగవంతం కావడంతో పరిశ్రమలకు, వ్యాపార రంగానికి కూడా మేలు కలుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ విస్తరణ, ఆధునీకరణపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు కీలక మైలురాయిగా భావిస్తున్నారు. త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
