డైరెక్షన్ పై అల్లరి నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
– ‘నా సినిమా కూడా డీడీఎల్జీలా చిరస్థాయిగా నిలవాలి’
మన భారత్, హైదరాబాద్: తెలుగు చిత్రసీమలో తన సొంత హాస్యశైలితో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అల్లరి నరేశ్, ఇప్పుడు డైరెక్షన్ వైపు అడుగులు వేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. దర్శకుడిగా మారాలనే ఆలోచన చాలా కాలం నుంచే ఉందని, తాను తీసే సినిమా కూడా ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’లా ఎప్పటికీ నిలిచిపోయే కృతిగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
తన నటనా ప్రయాణంలో తొలిసారిగా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో చేసిన చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’ గురించిన ఆసక్తికర వివరాలను కూడా నరేశ్ పంచుకున్నారు. ఈ సినిమా వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిందని, ఇందులో సమాంతరంగా మూడు నుంచి నాలుగు కథలు కలిసి నడుస్తాయని తెలిపారు. కొత్త జానర్కు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.
సస్పెన్స్, థ్రిల్ మరియు భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన ‘12ఏ రైల్వే కాలనీ’ ఇవాళ దేశవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. నరేశ్ కొత్త ప్రయోగం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.
