నిఖత్ జరీన్ ‘పసిడి ప్రదర్శన’పై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ప్రపంచ వేదికపై దేశ కీర్తిని చాటిన తెలంగాణ గర్వకిరీటం
మన భారత్, తెలంగాణ: వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్లో స్వర్ణ పతకం సాధించి భారత త్రివర్ణ పతాకాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లిన నిఖత్ జరీన్పై సీఎం ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు వెల్లువెత్తాయి. అద్భుత ప్రతిభ, దృఢ సంకల్పంతో ప్రపంచ వేదికపై భారత్ ప్రతిష్టను నలుదిశలా చాటిన నిఖత్ ప్రదర్శన అన్ని వర్గాల ప్రశంసలు పొందుతోంది.
“దేశం గర్వపడే విజయం” – సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేసిన ప్రకటనలో..నిఖత్ ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశారు. “ప్రపంచ వేదికపై దేశ కీర్తిని చాటిన ఈ విజయంతో యువ క్రీడాకారులకు అపూర్వ స్ఫూర్తి లభిస్తుంది,” అని కొనియాడారు.నిఖత్ భవిష్యత్తులో మరిన్ని అగ్రశిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
తెలుగు జాతి గౌరవాన్ని ఖండాంతరాలు దాటించారు – మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా నిఖత్ను ప్రత్యేకంగా అభినందించారు.“తెలుగు జాతి గౌరవాన్ని నిఖత్ మరోసారి ఖండాంతరాలకు తీసుకెళ్లింది. ఆమె ధైర్యం, పట్టుదల ప్రతి క్రీడాకారుడికి ఆదర్శం,” అన్నారు.
భారత్ బాక్సింగ్కు నిఖత్ – స్ఫూర్తి శిఖరం
51 కిలోల విభాగంలో జువాన్ యి గువోపై 5-0 తేడాతో ఏకపక్ష విజయం సాధించిన నిఖత్ విజయం భారత బాక్సింగ్ దాడిని మరింత బలోపేతం చేసింది. వరల్డ్ బాక్సింగ్ కప్లో భారత మహిళలకు ఇది ఐదో స్వర్ణం కావడం ప్రత్యేకత.
#NikhatZareen #RevanthReddy #TelanganaPride#WorldBoxingCup #IndianSports
