పెరిగిన కూరగాయల ధరల..

Published on

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరల దూకుడు.. మధ్య తరగతిపై మరింత భారం

మన భారత్‌, ములుగు: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతూ వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మొంథా తుఫాన్ ప్రభావం, కార్తీకమాసం డిమాండ్, రవాణా అంతరాయాలు కలిసి కూరగాయల మార్కెట్‌లో భారీ అస్థిరతను సృష్టించాయి. నగరాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా అన్ని చోట్లా కూరగాయల ధరలు మండిపోతున్నాయి.

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ, వరంగల్ వంటి ప్రధాన నగరాల్లోనే కాదు, ములుగు జిల్లాలోని గ్రామీణ రైతు బజార్లలో కూడా పలుచోట్ల కిలోకు రూ.100–120 వరకు పలుకుతున్నాయి. చిక్కుడు, గోబి, క్యారెట్, టమాటో, దోసకాయ, బీరకాయ, మిరపకాయ, వంకాయ వంటి ప్రతిరోజు వంటగదిలో ఉండే కూరగాయలే మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షలుగా మారాయి. పావు కేజీకి కూడా రూ.30–35 కంటే తక్కువకు లభించడం లేదు.

ఇటీవల మొంథా తుఫాన్ కారణంగా పలు జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పొలాల్లో నీరు నిల్వ ఉండటం, పంటలు కుళ్లిపోవడం, సరఫరా గొలుసు దెబ్బతినడంతో మార్కెట్‌లో సరుకు కొరత ఏర్పడింది. రవాణా సమస్యలు, పెరిగిన డిమాండ్ కూడా ధరల పెరుగుదలకు కారణమయ్యాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు స్థిరపడాలంటే సరఫరా వ్యవస్థ సాధారణ స్థితికి రావాలి. రాబోయే రెండు వారాల్లో వాతావరణం అనుకూలిస్తే మాత్రమే ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Latest articles

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

ఆదిలాబాద్ 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కలాల్ శ్రీనివాస్ విజయం

ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో...

ఆదిలాబాద్ 34వ వార్డులో 12 ఓట్ల తేడాతో ఎంఐఎం విజయం  ఉత్కంఠభరిత పోరులో షేక్ నజీర్ అహ్మద్ గెలుపు

మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి షేక్ నజీర్ అహ్మద్ హోరాహోరీగా...

ఆదిలాబాద్ 22వ వార్డులో ఎంఐఎం ఘన విజయం..

313 ఓట్ల మెజారిటీతో సమీనా బేగం గెలుపు మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 22వ వార్డులో...

More like this

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

ఆదిలాబాద్ 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కలాల్ శ్రీనివాస్ విజయం

ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో...

ఆదిలాబాద్ 34వ వార్డులో 12 ఓట్ల తేడాతో ఎంఐఎం విజయం  ఉత్కంఠభరిత పోరులో షేక్ నజీర్ అహ్మద్ గెలుపు

మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి షేక్ నజీర్ అహ్మద్ హోరాహోరీగా...