మన భారత్ | విజయనగరం:
బీజేపీ శిక్షణా మహాసభల్లో సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన మండల అధ్యక్షుడు మేటికోటి భాస్కరరావు
విజయనగరం జిల్లా రాజాంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణా మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరై పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా గజపతినగరం బీజేపీ మండల అధ్యక్షులు మేటికోటి భాస్కరరావు మంత్రి సత్యకుమార్ యాదవ్ను కలిసి గజపతినగరం ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే రోగులు, వారి సహాయకులు కూర్చోవడానికి తగినంత కుర్చీలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
రోగుల సౌకర్యార్థం ఆసుపత్రిలో అవసరమైన సంఖ్యలో కుర్చీలను ఏర్పాటు చేయాలని కోరుతూ మంత్రి గారికి వినతిపత్రం సమర్పించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటే ఆసుపత్రుల్లో ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండాలని ఆయన పేర్కొన్నారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ సమస్యను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని తెలిపారు.
ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం ప్రతి ప్రజాప్రతినిధి, పార్టీ నాయకుడి బాధ్యత అని, ఆరోగ్య రంగంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి. 📱📰
