గాల్లోనే ఆరిపోతున్న గౌడన్నల జీవితాలు..
మన భారత్, మొగుళ్లపల్లి: గౌడ సమాజానికి చెందిన కార్మికుల ప్రాణాలు తాటిచెట్లపై ప్రమాదాలకు బలవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పిడిసిల్ల గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నేరెళ్ల మొగిలి గౌడ్ (50) తాటిచెట్టుపై పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో పిడిసిల్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబానికి ఏకైక ఆదారంగా ఉన్న మొగిలి గౌడ్ మృతి చెందడంతో వారి కుటుంబం తీవ్ర...