చెల్లి ఆత్మహత్య.. తలకొరివి పెట్టిన అక్క
మన భారత్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. చందారం గ్రామానికి చెందిన మాధవి (17) అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని పరీక్షల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాల ప్రకారం, మాధవి చిన్నతనంలోనే తల్లిదండ్రులు సుధాకర్, కవితలను కోల్పోయింది. అప్పటి నుంచి ఆమె అక్క అనిత సంరక్షణలో పెరిగింది. చదువులో ఎదురైన ఓటమిని తట్టుకోలేక క్షణికావేశంలో ఈ దారుణ నిర్ణయం తీసుకోవడం గ్రామంలో...