మే లో కూతురి పెళ్లి.. తండ్రి ఆత్మహత్య
మన భారత్ ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల భారంతో పాటు కూతురి పెళ్లి బాధ్యతలు మోస్తూ తీవ్ర మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బేల మండలంలోని పాఠన్ గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన రైతు లస్మారెడ్డి (49) సాగులో సరైన దిగుబడి రాకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో మానసికంగా తీవ్రంగా కలత చెందుతున్నాడు. ఇదే సమయంలో వచ్చే నెలలో జరగాల్సిన తన...