అంబేద్కర్ జయంతి ర్యాలీతో వేడుకలు..
మన భారత్ ,తలమడుగు: తలమడుగు మండలంలోని ఝరి గ్రామంలో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. గ్రామస్తులు, యువకులు, యువత కలిసి డప్పు చప్పుళ్ల మధ్య మంగళహారాలతో భారీ ఊరేగింపు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న గ్రామ ప్రజలు పూలదండలతో ఘన నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి, కులమత భేదాలు లేకుండా అందరికీ భోజన వసతి...