ఇళ్ళపై 33/11 కేవీ లైన్.. తీసెదెప్పుడో.?
మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు మండల కేంద్రంలో ఉన్న 33/11 కేవీ విద్యుత్ లైన్ స్థానిక ప్రజలకు ప్రాణాంతకంగా మారిందని నివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సబ్స్టేషన్ నుండి సరఫరా అవుతున్న ఈ హై వోల్టేజ్ లైన్ దాదాపు 15 నుంచి 20 ఇళ్ల మధ్యగా, ఇళ్లపైగానే వెళ్లడం వల్ల రోజువారీ జీవనంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. స్థానికుల వివరాల ప్రకారం, హై వోల్టేజ్ ప్రభావంతో టీవీలు, ఫ్రిజ్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తరచూ...