లోన్ ఇస్తామని ఎమ్మెల్యే అకౌంట్ కాలీ.!
మన భారత్, తెలంగాణ: సైబర్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు సైతం మోసగాళ్ల బారిన పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం, “వికసిత్ భారత్” పథకం పేరుతో ఒక వ్యక్తి ఎమ్మెల్యేను సంప్రదించి అర్హుల జాబితా పంపిస్తే ప్రతి ఒక్కరికీ రూ.10 లక్షల రుణాలు మంజూరు చేస్తామని నమ్మబలికాడు. ఈ ప్రక్రియలో ప్రాసెసింగ్ ఫీజుగా ఒక్కొక్కరికి...