రైతుల బోనస్ సమస్య వెంటనే పరిష్కరించాలి:
మన భారత్, జయశంకర్ భూపాలపల్లి: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతుల సమస్యలపై కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు రైతులు పాల్గొని తమ సమస్యలను వెల్లడించారు. రైతులు మాట్లాడుతూ, వర్షాకాలం వరి పంటకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన బోనస్ డబ్బులు ఇప్పటివరకు తమ బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం పలుమార్లు వ్యవసాయ అధికారులను, బ్యాంకులను...