సీఎం మనువడు బాసరలో అక్షరాభ్యాసం.!
తెలంగాణ, మన భారత్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర క్షేత్రంలో తన మనువడు రేయాన్ష్ రెడ్డికి అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం సతీమణి గీతా రెడ్డితో కలిసి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన సీఎం కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ పండితులు సంజీవ్ ఆధ్వర్యంలో అక్షరాభ్యాస వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం తన మనువడిని ఒడిలో కూర్చోబెట్టుకుని పలకపై ఓనమాలు దిద్దించి విద్యారంభాన్ని చేశారు. అనంతరం...