రైతు భరోసా రెండో విడత నిధులకు ముహూర్తం.!
మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రైతు భరోసా పథకం కింద రెండో విడత ఆర్థిక సహాయాన్ని ఏప్రిల్ రెండో వారంలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి చర్యలు వేగవంతం అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ రూ.2,650 కోట్లను సమీకరించే ప్రక్రియలో నిమగ్నమైంది. ఈ విడతలో ప్రధానంగా 5 ఎకరాల లోపు భూమి కలిగిన చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం...