బోర్డు నీడనే ప్రయాణికులకు దిక్కు..
మన భారత్ , తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్లో కనీస వసతుల కొరతతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పూర్తిస్థాయి షెల్టర్ లేకపోవడం వల్ల ఎండలు, వర్షాల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీరామనవమి సందర్భంగా హాలిడేస్ కారణంగా బస్సులు సరిగా నడవకపోవడంతో, స్థానిక ప్రజలు తమ అవసరాల నిమిత్తం లోకల్ ట్రైన్ ద్వారా ఆదిలాబాద్కు ప్రయాణించారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఆటో డ్రైవర్లు తలమడుగు నుంచి ఆదిలాబాద్ వరకు...