దారుణం: అక్రమ సంబంధం.. కన్న పిల్లల హత్య.!
మన భారత్ ,ఆంధ్రప్రదేశ్: పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే క్షణికావేశం, అక్రమ సంబంధాల కారణంగా వారి ప్రాణాలు తీస్తున్న దారుణ ఘటనలు ఆంధ్రప్రదేశ్లో వెలుగుచూశాయి. ఈ ఘటనలు సమాజాన్ని కలవరపరిచేలా ఉండటమే కాకుండా, మానవత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తిరుపతి జిల్లాలోని నరసరాజు అగ్రహారంలో చోటుచేసుకున్న ఘటనలో, ఐదు నెలల పసికందు ఏడుస్తోందన్న కారణంతో తల్లి హేమావతి తన కూతురిని హతమార్చినట్లు సమాచారం. అనంతరం భర్తకు ఫోన్ చేసి, ‘నీకో బ్యాడ్ న్యూస్… నాకో గుడ్ న్యూస్…...