“రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి”
మన భారత్,ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీకి బలోపేతం అవసరమని, దేశానికి శక్తివంతమైన నాయకత్వం కావాలని పేర్కొంటూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని కాంగ్రెస్ కార్యకర్త గుడిపల్లి నగేష్ పిలుపు నిచ్చారు. అదే సమయంలో ఆదిలాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తాను స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తన రాజీనామాపై వస్తున్న వివిధ ఊహాగానాలను ఖండిస్తూ నగేష్ స్పష్టం చేశారు. “నా రాజీనామాకు ఎలాంటి విభేదాలు లేదా ఒత్తిళ్లు కారణం కావు. కొత్త కార్యకర్తలకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే...