ఆరు గ్యారంటీలు వెంటనే అమలు చేయాలి..
మన భారత్: తాంసి, ఆదిలాబాద్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు తాంసి మండల కేంద్రంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు వెంకట రమణ మాట్లాడుతూ, అధికారంలోకి రావడానికి ముందు 100 రోజుల్లోనే హామీలు నెరవేరుస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. హామీలు అమలు కాకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం రైతు భరోసా...