పెట్రోల్ కొరత పుకార్లను నమ్మొద్దు: MMR
మన భారత్: అదిలాబాద్ : జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న పుకార్లను ప్రజలు నమ్మవద్దని పెట్రోల్ బంక్ యజమాని, సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ప్రజలకు స్పష్టత ఇచ్చారు. జిల్లాలో ఎటువంటి ఇంధన కొరత లేదని, సరఫరా సజావుగా కొనసాగుతోందని మౌనిష్ రెడ్డి తెలిపారు. కొందరు అసత్య ప్రచారాలు చేయడం వల్ల ప్రజల్లో అనవసర భయం నెలకొంటోందని అన్నారు. వినియోగదారులు అవసరానికి మించిన పెట్రోల్ కొనుగోలు...