గ్రామ భద్రతకు సీసీ TV లే శక్తి – ఎస్పీ అఖిల్ మహాజన్
మన భారత్, ఆదిలాబాద్: జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం అత్యంత అవసరమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (IPS) స్పష్టం చేశారు. నేరాల స్వరూపం రోజురోజుకు మారుతున్న నేపథ్యంలో, పోలీసు వ్యవస్థకు ప్రజల సహకారం కీలకమని ఆయన పిలుపునిచ్చారు. తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన 21 సీసీటీవీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, పెద్దలు సంప్రదాయ డప్పు వాయిద్యాల నడుమ ఘన...