రాష్ట్రంలో ఐదుగురు డీఎస్పీల బదిలీకి ఉత్తర్వులు..
మన భారత్, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక బదిలీలు చోటు చేసుకున్నాయి. ఐదుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ బి. శివధర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాలు, పనితీరు మెరుగుదల లక్ష్యంగా ఈ బదిలీలు చేపట్టినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర పోలీస్ అకాడమీ స్టాండ్స్ డీఎస్పిగా, అలాగే ఇల్లందు ఎన్ఆర్పీఓగా విధులు నిర్వహిస్తున్న ఎస్. సారంగపాణిని వైరా ఏసీపీగా బదిలీ చేశారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో డీఎస్పిగా పని చేస్తున్న పద్మనాభుల...