హెల్మెట్ ధరించాలని పోలీసుల బైక్ ర్యాలీ..
నిర్లక్ష్యం వద్దు… హెల్మెట్ ధరించడం ముద్దు మన భారత్ | తాంసి ప్రతి ఒక్క వాహనదారుడు నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణాలు చేపట్టాలని ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిదర్ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా సోమవారం తాంసి మండల కేంద్రంలో హెల్మెట్ వినియోగంపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జీవన్ రెడ్డితో కలిసి వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతను వివరించారు. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో...