బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో వర్షాలు
బంగాళాఖాతంలో బలహీనపడిన వాయుగుండం.. ఏపీలో వర్షాలు మన భారత్, ఆంధ్రప్రదేశ్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడింది. శనివారం శ్రీలంకలోని ముల్లయిట్టివు సమీపంలో తీరం దాటిన వాయుగుండం ప్రస్తుతం ముల్లయిట్టివుకు సుమారు 30 కిలోమీటర్లు, చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఆదివారం నాటికి ఇది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఈ వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణ మార్పులు చోటు...