ముగిసిన ఎన్ఎస్ఎస్ శిబిరం..
వ్యక్తిగత మరుగుదొడ్లపై అవగాహన ర్యాలీతో ఎన్ఎస్ఎస్ శిబిరం ముగింపు మన భారత్, తాంసి, నవంబర్ 7: ప్రభుత్వ జూనియర్ కళాశాల, తాంసి ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన శీతాకాల ప్రత్యేక శిబిరం గురువారం విజయవంతంగా ముగిసింది. వామన్ నగర్ గ్రామంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో వ్యక్తిగత మరుగుదొడ్ల ప్రాధాన్యతపై అవగాహన ర్యాలీని వాలంటీర్లు నిర్వహించారు. వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి బహిర్భూమికి వెళ్లడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు వ్యక్తిగత మరుగుదొడ్ల అవసరం గురించి గ్రామ ప్రజలకు వివరించారు....