ఈ నెల 12 న జాతీయ లోక్ అదాలత్..
రాజీ పడదగ్గ కేసులను పరిష్కరించుకునేందుకు అవకాశం.. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి ఆదిలాబాద్:మన భారత్, సెప్టెంబర్ ,1, కక్షిదారులు తమ కేసులను సత్వరంగా, సులభంగా పరిష్కరించుకునేందుకు ఈనెల 12వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయాధికారి కే. ప్రభాకర్ రావు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా రాజీ పడదగిన కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. జాతీయ లోక్...