మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా..
మన భారత్ , ఆగస్టు25 ఆదిలాబాద్: పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వన మహోత్సవంలో భాగంగా ఆదిలాబాద్ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ జిల్లాలో పచ్చదనాన్ని పెంచేందుకు వన మహోత్సవం కార్యక్రమం కింద విస్తృతంగా మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు,...