అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా గుట్టురట్టు
44 ద్విచక్ర వాహనాలు స్వాధీనం.. 8 మంది అరెస్ట్.. మరో 20 మంది కొనుగోలుదారులపై పోలీసుల దృష్టి మన భారత్, ఆగస్టు 12, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో వరుసగా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఆదిలాబాద్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, విశ్వసనీయ సమాచారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదుగురు బైక్ దొంగలను, దొంగిలించిన వాహనాలను కొనుగోలు చేసిన ముగ్గురిని...