అప్పుల బాధతో రైతు బలవన్మరణం..
తలమడుగు, ఆగస్టు 7 (మన భారత్): ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో అప్పుల భారాన్ని తట్టుకోలేక ఓ రైతు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయంలో వరుస నష్టాలు, అప్పుల ఒత్తిడి కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన రైతు ప్రాణాలు కోల్పోవడం గ్రామంలో విషాదాన్ని నింపింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. తలమడుగు మండలంలోని పల్లి (బి) గ్రామానికి చెందిన రైతు మోతె అశోక్ (48) గత ఏడాది సాగు కోసం చేసిన అప్పులు ఇంకా...