ఔట్సోర్సింగ్ ఏజెన్సీల పేరుతో కొండా దంపతులపై అసత్య ప్రచారాన్ని మానుకోవాలి
తప్పుడు ప్రచారాలు కొనసాగితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు: వేముల మహేందర్ గౌడ్ మన భారత్, మొగుళ్లపల్లి: ఔట్సోర్సింగ్ ఏజెన్సీల కేటాయింపుల పేరుతో మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ దంపతులపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని కొండా దంపతుల వీరాభిమాని వేముల మహేందర్ గౌడ్ హెచ్చరించారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాలు మరియు వాట్సాప్ గ్రూపుల్లో కొందరు కావాలనే...