అభివృద్ధికి ఆమడ దూరంలో రత్నాపూర్..!
రోడ్డు లేదు.. బస్సు రాదు.. తాగునీటి సమస్యతో గ్రామస్తుల ఆవేదన మన భారత్, ఆదిలాబాద్ జిల్లా | తలమడుగు సాంకేతికంగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు ఇంకా అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలానికి చెందిన రత్నాపూర్ గ్రామం గత రెండు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో రహదారి సౌకర్యం లేకపోవడం, అంగన్వాడీ కేంద్రం లేకపోవడం, గ్రామపంచాయతీ భవనం అందుబాటులో లేకపోవడం,...