ముక్కోటి దేవుళ్ల అనుగ్రహం ప్రజలపై ఉండాలి: కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము
మన భారత్, మొగుళ్లపల్లి: ముక్కోటి దేవుళ్ల ఆశీస్సులు మొగుళ్లపల్లి మండల ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము ప్రార్థించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడి పంటలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటూ ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. నడిగోటి రాము నేతృత్వంలో మొగుళ్లపల్లి గ్రామానికి చెందిన యువకులు ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా తిరుపతి సమీపంలోని మంగాపురంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం రామచంద్రపురం రాయల చెరువు...