మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లిన దుండగులు
మన భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో పగటి పూట జరిగిన చైన్ స్నాచింగ్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మోటార్ సైకిల్పై వెళ్తున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వెనక నుంచి వచ్చి లాక్కెళ్లిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల వివరాల ప్రకారం బాధిత మహిళ తన పనుల నిమిత్తం మోటార్ సైకిల్పై వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు మరో బైక్పై...